
ప్రజల ఆరోగ్యాలను కాపాడే మందుల, పరికరాల ధరలపై జీఎస్టీ ఎత్తివేయాలని ఏపీ మెడికల్ సేల్స్ రీప్రంజటెటిన్స్ యూనియన్ రాష్ట్ర సంయుక్త ప్రధాన కార్యదర్శి రవికుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం విజయనగరంలో జీఎస్టీ అసిస్టెంట్ కమీషనర్కి వినతిపత్రం అందజేశారు. మందులపై 18 శాతం జీఎస్టీ ఉందని, అత్యవసర, నిత్యావసర మందుల ధరలు పేదలకు అందుబాటులో లేవని వినతిపత్రంలో పేర్కొన్నారు.